Rajeev Kanakala as cop with Sindhu Tolani
21-Aug-2008
రాజీవ్ కనకాల, సింధుతులాని, సుహాసిని, శ్రీనివాసరెడ్డి, మోహిత్ లు ప్రధాన తారాగణం గా ఫణిరాజ్ దర్శకత్వం లో జోషిక సాయి లక్ష్మి ఫిలింస్ బ్యానర్ పై డి.రమేష్ బాబు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంబోత్సవం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముఖ్య అతిధులు గా విచ్చేసిన కోదండరామిరెడ్డి, తమ్మారెడ్డి భరధ్వాజ, కె.రాఘవేంద్ర రావు లు క్లాప్, స్విచాన్, గౌరవ దర్శకత్వ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన పత్రికా సదస్సులో మాట్లాడుతూ ఇది ఒక త్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ అనీ తరవాత ఏమవుతుంది అన్నది ఎవరూ వూహించలేని విధంగా కధనం వుంటుందనీ, ఈ విషయం లో ఫణిరాజ్ ను అబినందించాల్సిందే అని కధ విన్నవెంటనే తనకు ఈ చిత్రం చేయాలనిపించిందనీ రాజీవ్ కనకాల అన్నారు. సుహాసిని మాట్లాడుతూ నిర్మాత తనకు చాలా కాలంగా పరిచయం అనీ తన సొంత చిత్రం లో చేస్తున్న ఫీలింగ్ వుందనీ, అలాగే తన కో స్టార్స్ కూడా ఎవ్వరూ కొత్తవారు లేరనీ డెఫినెట్ గా ఇది ఒక మంచి సినిమా అవుతుందనీ అన్నారు. నటుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కనిపించే మూడు సింహాలూ చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమే రాజీవ్ కనకాల అనీ అతని పక్క సింహాన్ని నేనే అని నవ్వుతూ అన్నారు ( ఈ చిత్రం లో రాజీవ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు). నిర్మాత రమేష్ బాబు మాట్లాడుతూ ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా వున్న నేను ఈ రోజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను అంటే దాని వెనుక చాలామంది సహకారం వుందనీ, రాజీవ్ గారి తో సహా అందరూ తనకోసం తమ తమ పారితోషకాలను తగ్గించుకొని మరీ ఈ చిత్రాన్ని చేస్తున్నారనీ వారి రుణం తీర్చుకోలేనిదనీ, ఈ చిత్రం మీద తనకు పూర్తి నమ్మకం వుందనీ డెఫినెట్ గా ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్న్ అందించబోతున్నాననీ అన్నారు.
|