Rambha's reentry with home prod Prathikshanam
13-Sep-2008
ఆ ఒక్కటీ అడక్కు తో మొదలు పెట్టి బొంబాయి ప్రియుడూ, బావగారూ బావున్నారా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన రంభ అప్పుడప్పుడూ అలా అలా తళుక్కుమని మెరవడం తప్పా దాదాపు గా టాలీవుడ్ కి దూరమయైపోయిందనే చెప్పాలి. ఆ మద్య చేసిన కొత్తకధ అనే చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి సమయం లో మళ్ళీ ఒక థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈమె రానుంది. ప్రతి క్షణం అనే టైటిల్ తో వ్యాస్ దర్శకత్వం లో రంభ సోదరుడైన పల్లవి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగాయి. ముఖ్య అతిధులు గా రాఘవేంద్ర రావు, తమ్మారెడ్డి భరద్వాజ, రాజా వన్నెం రెడ్డి తదితరులు హాజరయ్యారు. తొలి క్లాప్ ను రాజా వన్నెం రెడ్డి ఇవ్వగా, కెమెరా స్విచ్ ఆన్ రాఘవేంద్ర రావు చేసారు.
అనంతరం జరిగిన పత్రికా సదస్సు లో హీరోయిన్ రంభ మాట్లాడుతూ " నేను మొట్టమొదటి సారిగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తున్నాను, ఒక రోజు లో ఒక అమ్మాయి జీవితం లో జరిగిన సంఘటన ల సమాహారమే ఈ చిత్రం. థ్రిల్లర్ అన్నానని ఇదేమీ బ్లడ్ షెడడ్ ఫిల్మ్ ఎంతమాత్రం కాదు చిన్న పిల్లల దగ్గరనుండీ అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు." అని అన్నారు. నిర్మాత పల్లవి శ్రీని వాస్ మాట్లాడుతూ ఒక కొత్త తరహా చిత్రాన్ని రూపొందిచడానికి ప్రయత్నిస్తున్నామనీ, ఇందులో ప్రకాష్ రాజ్ గారిది చాలా ప్రధాన మైన పాత్ర అనీ ఈ రోజు నుండీ ఈ నెలాఖరు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపి కొంత భాగాన్ని శ్రీలంక లో షూట్ చేయనున్నామని తెలిపారు. చివరిగా దర్శకుడు వ్యాస్ మాట్లాడుతూ ఇదొక హీరోయిన్ ఓరియెంటడ్ చిత్రం అనీ అలాగే ప్రకాష్ రాజ్ ది ఒక వైవిద్యమైన పాత్ర అని ఈ చిత్రం ద్వారా ఎ ఆర్ రెహమాన్ అసిస్టెంట్ తాజ్ నూర్ ని సంగీత దర్శకుడి గా పరిచయం చేస్తున్నామనీ అలాగే తమకు పనీర్ సెల్వం రూపం లో అద్బుతమైన కెమెరా మేన్ దొరికాడనీ అన్నారు.
Prathi Kshanam opening - Events, Rambha - Exclusive,
|
|